సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి మంగళవారం (ఏప్రిల్ 28) రోజున శంకుస్థాపన జరిగింది. ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం, విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన. పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి మంగళవారం (ఏప్రిల్ 28) రోజున శంకుస్థాపన జరిగింది. తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్కు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏపీ మంత్రి నారా లోకేష్, గూగుల్ సంస్థ, అదానీ గ్రూప్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఇక, 1 గిగావాట్కు పైగా సామర్థ్యంతో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని మూడు చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో తర్లువాడలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. డేటా సెంటర్ల కోసం తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.80 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇక, గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా ఒక గిగావాట్ సామర్థ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశ టెక్నాలజీ రంగంలో కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆసియా ఖండానికే కీలకమైన ఏఐ గేట్ వేగా విశాఖ అవతరించనుందని ధీమా వ్యక్తం చేసింది. అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖ చోటు సంపాదించనుందని తెలిపింది. విశాఖపట్నం తీరప్రాంతం కావడంతో అంతర్జా తీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఎంతో అనుకూలంగా ఉండనుంది. తర్లువాడ, అడవివరం రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో, గిగావాట్ సామర్థ్యంతో మూడు చోట్ల సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్ట్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా లాంటి సంస్థలు ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6.5 గిగా వాట్ల సామర్థ్యంతో మల్టీ- గిగావాట్ డిజిటల్ హబ్ను నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా, భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఆర్కిటెక్చర్, డేటా సైంటిస్ట్వంటి రంగాల్లో వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనుందని…గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలో అనుబంధ రంగాలనుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ తయారీ, నెట్ వర్కింగ్ వంటి రంగాల్లో స్థానికంగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్లతో ఏఐ ఏకోసిస్టమ్ ఏర్పాటు కానుంది.