సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డిపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డికి కూటమి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. వెంకటరామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో సర్వీస్ నిబంధనలను బేఖాతరు చేస్తూ వైసీపీ అభ్యర్థుల తరపున బహిరంగంగా ప్రచారం నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన్ను ఉద్యోగం నుండి తొలగిస్తూ (డిస్మిస్) సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటరామిరెడ్డి డిస్మిస్ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డిపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.‘ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుంది అని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశంపై పూర్తి విచారణ జరిగిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంతో ఆయన కేవలం ఉద్యోగాన్ని మాత్రమే కాకుండా, తనకు లభించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు, పెన్షన్ ప్రయోజనాలను కూడా పూర్తిగా కోల్పోతారని పేర్కొంది. న్యాయపోరాట చేస్తాం ప్రభుత్వం విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై వెంకటరామిరెడ్డి స్పందించారు. ప్రభుత్వం తనను అడ్డగోలుగా డిస్మిస్ చేసిందని, తాను న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను గత రెండెళ్లుగా తాను సస్పెన్‌లో ఉన్నానని చెప్పుకొచ్చారు. తనకు మరో 14 ఏళ్ల పాటు సర్వీస్ ఉందని చెప్పుకొచ్చారు.2024 ఎన్నికల్లో తాను వైసీపీకి ప్రచారం చేసినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు అని చెప్పుకొచ్చారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లుఎక్కడా ఆధారాలు లేవని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. 2014-19లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశారని… కానీ వాళ్లెవరినీ డిస్మిస్ చేయలేదని గుర్తు చేశారు. ఉద్యోగులు ప్రశ్నించకూదడనే తనపై వేటు వేసిందని వెంకటరామిరెడ్డి ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *