జగిత్యాల సభలో కేసీఆర్ ప్రసంగం: బీఆర్ఎస్ పునరాగమనంపై విశ్వాసం

“నా తొలి సంతకం హైడ్రా రద్దు ఫైల్‌పై”: కేసీఆర్ వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక హైడ్రాను తీసుకువచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను ఎత్తిపడేసే ఫైల్‌పైనే తొలిసంతకం పెడతామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేయకుండా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తోంది అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మాట్లాడితే పిల్లి శాపనార్థాలు తప్ప ఇంకేమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. మీ పిల్లి శాపనార్థాలకు కేసీఆర్ చస్తాడా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ చస్తారు?చావాలి? అంటూ శాపనార్థాలే తప్ప ఇంకేమైనా ఈ ప్రభుత్వం చేసింది ఉందా అని మండిపడ్డారు. కేసీఆర్ తుదిశ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాడని చెప్పుకొచ్చారు. మాజీమంత్రి టీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మాజీమంత్రి జీవన్ రెడ్డి మెడలో పార్టీ కండువాకప్పి స్వాగతించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో యూరియా సైతం ఇవ్వలేకపోతుంది అని మండిపడ్డారు. యూరియా తెచ్చే దమ్ములేక యాప్‌లు తీసుకువచ్చాయని అన్నారు. ఈ యాప్‌లతో రైతులకు కాళ్ల వాపులు తప్ప చేసిందేమీ లేదు అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. హైడ్రాను ఎత్తిపడేస్తాం తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక హైడ్రాను తీసుకువచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను ఎత్తిపడేసే ఫైల్‌పైనే తొలిసంతకం పెడతామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి జీవన్ రెడ్డి మాజీమంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువాకప్పుకున్నారు. జగిత్యాల సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా, జగిత్యాల నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా పేరున్న సీనియర్ రాజకీయ నేత టీ.జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జీవన్ రెడ్డి వంటి నేత రావడంతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌కు భారీ బలం చేకూరినట్లయింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *