పయనించే సూర్యుడు న్యూస్ : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం అని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయమంత్రి జయంత్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 587 విద్యాలయాల్లో ఇప్పటికే 528 విద్యాలయాల్లో కార్యకలాపాలు మిగిలిన పాఠశాలల నిర్మాణం వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజిబివి) నిర్మాణ పనులను త్వరితగతన పూర్తి చేస్తామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 587 కేజీబివి పాఠశాలలు ఉండగా ఆయా విద్యాలయాల్లో 528 పాఠశాలలు ప్రస్తుతం కార్యకలాపాల్లో ఉన్నాయని, మిగిలిన పాఠశాలలు నిర్మాణ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయని, వాటి స్థితిగతుల వివరాలు, నిర్మాణం పూర్తికాని కేజీబివి విద్యాలయాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తెలిపాలని సోమవారం లోక్సభలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు సంబంధిత శాఖ పూర్తి భాద్యతలు చూస్తున్న కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు.ఎంపి కేశినేని శివనాధ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సవివరంగా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 587 కేజీబీవీ విద్యాలయాలు రాష్ట్రంలో 587 విద్యాలయాలు ఉండగా వాటిలో జిల్లాల వారీగా అనంతపురం జిల్లాలో అత్యధికంగా 50 , విజయనగరం, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాలలో 47 చొప్పున, శ్రీకాకుళంలో 44, ప్రకాశం జిల్లాలో 44 పాఠశాలలు ఉన్నాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. వాటిలో 528 విద్యాలయాల్లో ఇప్పటికే కార్యకలాపాలు జరుగుతున్నాయని…పనిచేస్తున్నాయని వివరించారు.రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభం కాని విద్యాలయాలు 59 ఉండగా అందులో 10 పాఠశాలలు రద్దు చేయబడ్డాయని తెలిపారు . మిగిలిన పాఠశాలల్లో నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తన సమాధానంలో వెల్లడించారు. పీఏబీ ద్వారా కేజీబీవీ పాఠశాలల నిర్వహణ రాష్ట్రంలో కస్తూర్భా గాంధీ బాలికా పాఠశాలలు ప్రధానంగా 2011-12, 2016-17 ,2017-18 సంవత్సరాల్లో మంజూరు చేయబడ్డాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. వీటిలో ఎక్కువగా 2016–17లో 26 పాఠశాలలు మంజూరు అయ్యాయన్నారు. నిర్మాణ దశలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి వాటిని కార్యకలాపాల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో పనిచేయని కెజిబివి పాఠశాలల నిర్వహణ పథకం అమలును ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్ ( పీఏబి ) ద్వారా పర్యవేక్షిస్తున్నామని, అలాగే పాఠశాల విద్య ,అక్షరాస్యత విభాగం ద్వారా నెలవారీ మరియు అర్ధ వార్షిక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు.