జనం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత, పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు వంటి సమస్యను పరిష్కరించేందుకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర (IPS) రంగంలోకి దిగారు. పెట్రోల్, డీజిల్ కంపెనీలకు మార్కెట్లో సరిపడా నిల్వలు ఉంచాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడటానికి తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చమురు సరఫరాను 126% పెంచింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్ల స్థానిక పెట్రోల్ బంకుల్లో తలెత్తిన రద్దీని తగ్గించడానికి అధికారులు ఈ వేగవంతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. అయితే అకస్మాత్తుగా పెట్రోల్ బంకుల దగ్గర ఇలా ఊహించని రద్దీ పెరగడానికి గల కారణాలపై అధ్యయనం చేసింది.మూడు కారణాల వల్లే పెట్రోల్ బంకుల వద్ద జనం రద్దీ విపరీతంగా పెరిగింది అని తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. రద్దీ పెరగడానికి ప్రధానమైన మూడు కారణాలు ఇవే మొదటిది : పరిశ్రమలకు వాడే డీజిల్ ధరను ఇటీవల లీటరుకు రూ. 150 కు పెంచారు. దీంతో పెద్ద మొత్తంలో కొనే వ్యాపారులు, లీటరు రూ. 95 కే దొరుకుతున్న సాధారణ పబ్లిక్ పెట్రోల్ బంకులకు వచ్చి డీజిల్ కొంటున్నారు. రెండవది : పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో సరఫరా సమస్యలు ఉన్నాయి. దీనివల్ల పక్క రాష్ట్రాల ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం ఖమ్మం, నిర్మల్ లాంటి తెలంగాణ సరిహద్దు జిల్లాలకు క్యూ కడుతున్నారు. మూడవది : ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే తప్పుడు పుకార్ల వల్ల సాధారణ ప్రజలు భయపడి, అవసరానికి మించి కొని దాచుకుంటున్నారు. దీంతో స్థానికంగా ఉన్న నిల్వలు వేగంగా అయిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3100 ఇంధన ట్యాంకర్లు తెలంగాణ రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత, పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు వంటి సమస్యను పరిష్కరించేందుకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర (IPS) రంగంలోకి దిగారు. పెట్రోల్, డీజిల్ కంపెనీలకు మార్కెట్లో సరిపడా నిల్వలు ఉంచాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సరఫరాను వేగవంతం చేయడానికి, డీలర్ల నుంచి ముందుగానే ఆర్డర్లు తీసుకుంటూ…రాష్ట్రవ్యాప్తంగా 3,100 ఇంధన (ట్యాంకర్ల) వాహనాలను రంగంలోకి దించారు.పెట్రోల్ బంకుల్లో నిల్వలు అయిపోకముందే వాటికి ఇంధనం చేరేలా అధికారులు పర్యవేక్షణ పెంచారు. ప్రతి మూడు గంటలకోసారి బంకుల నుంచి నిల్వల వివరాలు తెప్పించుకోవడంతో పాటు, ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడాలని కఠిన ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల పంట కోతలు, ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకం కలగదు అని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర అభిప్రాయపడ్డారు. డీజిల్ పంపిణీ 151శాతం పెరిగింది ఏప్రిల్ 27 నాటికి రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ డీజిల్ పంపిణీ 151% పెరిగి 7,348 కిలో లీటర్ల నుంచి 18,449 కిలో లీటర్లకు పెరిగింది అని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ పంపిణీ కూడా దాదాపు రెట్టింపు అయ్యింది. ఇది 95% పెరిగి 5,883 కిలో లీటర్ల నుంచి 11,490 కిలో లీటర్లకు చేరుకుంది అని వివరించారు. రాజధాని ప్రాంతంలో ఎలాంటి కొరత రాకుండా చూడటానికి, హైదరాబాద్లో ఇంధన సరఫరాను 43% మేర పెంచినట్లు పేర్కొన్నారు. నగరంలో డీజిల్ నిల్వలను 46% (3,393 నుంచి 4,957 కిలో లీటర్లకు), పెట్రోల్ నిల్వలను 40% (3,908 నుంచి 5,466 కిలో లీటర్లకు) పెంచారన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత లేదు తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ప్రజలకు హామీ ఇస్తోంది. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ఎప్పటిలాగే తమకు అవసరమైన మేరకే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని అధికారులు కోరుతున్నారు. ప్రజల, రైతుల అవసరాలకు సరిపడా నిల్వలు పెట్రోల్ బంకుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి అని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.