సాక్షి డిజిటల్ న్యూస్: ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించింది. రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుంది అని ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించింది. ఈ మేరకు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. రాష్ట్రపతి సంతకం తర్వాత కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసింది. సీఆర్డీఏ 2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని కేంద్రం రాజధానిగా నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేసింది. అమరావతికి చట్టబద్దత కల్పించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి లైన్ క్లియర్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత కలిపించింది. అమరావతికి చట్టబద్ధత బిల్లు రాష్ట్రపతి భవన్కు చేరుకుంది. రాజ్యసభ నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి చేరుకున్న బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉత్తర్వులు 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందని గెజిట్ ప్రకటనలో కేంద్రం తెలిపింది.సీఆర్డీఏ 2014లో పొందుపరచిన అమరావతి రాజధానిగా కేంద్రం నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేసింది. రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ద కల్పించే బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మ సంతకం చేసి ఆమోదించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాష్ట్రపతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.‘మన రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం 2026కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉండి, దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ, మా వెన్నంటే నిలిచిన ప్రతి పౌరునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయం’అని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రపతి కార్యాలయానికి చేరిన రోజే చట్టబద్దత కల్పించిన ద్రౌపది ముర్ము ఇకపోతే సోమవారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు రాష్ట్రపతి భవన్కు చేరుకుంది. రాజ్యసభ నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి చేరుకుంది. పరిశీలన, న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లుకు ఆమోదం తెలిపారు.రాష్ట్రపతి ఆమోదం అనంతరం అమరావతికి చట్టబద్దత బిల్లు చట్టరూపం కార్యదాల్చింది. ఇకపోతే ఏపీ పునర్విభజన చట్ట సవరణ 2026 బిల్లుకు పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పార్లమెంట్ తీర్మానంతో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అమరావతి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండనుంది. ఇకపోతే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుపై సుమారు 5 గంటల పాటు లోక్సభ, రాజ్యసభల్లో బిల్లుపై చర్చలు జరిగాయి. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఉభయ సభల ఆమోదం తర్వాత లోక్సభ సచివాలయం ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపింది. సోమవారం ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అనంతరం కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుల చేసిది.