తెలుగు వైభవానికి ప్రతీకగా అమరావతి

* సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి- సీఎం చంద్రబాబు దృష్టి

పయనించే సూర్యుడు న్యూస్ : తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి అభివృద్ధి చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించండి అని చెప్పుకొచ్చారు. క్రీడలు, పర్యాటకానికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా… భావితరాలకు అందించేలా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధానిలోని వివిధ సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపులు, సెక్రటేరియేట్, హెచ్వోడీ భవనాల్లో కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. సీఆర్డీఏ నుంచి వచ్చిన వివిధ ప్రతిపాదనలను సీఆర్డీఏ అథార్టీ సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…రాజధాని పరిధిలోని నీరుకొండ వద్ద చేపట్టే టూరిజం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి. మొత్తంగా 167 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్దం చేయడంతో పాటు తెలుగు వైభవాన్ని చాటేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాజెక్టులో వాటర్ ఫ్రంట్, కల్చరల్ సెంటర్ తదితర విభాగాలు వస్తాయి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్పోర్ట్స్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ‘పర్యాటకంతో పాటు నిత్యం రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకునే వాతావరణం ఉండేలా చూడాలి. హోటళ్లను ఏర్పాటు చేయాలి… అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ధి చేయాలి. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా ఆ ప్రాంతాన్ని డిజైన్ చేయాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘నీరుకొండలో చేపట్టే బోయే ప్రాజెక్టును అత్యంత సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలి. భవిష్యత్తులో క్రీడా రంగం అతి పెద్ద ఆదాయ వనరు కాబోతోంది. దీనికి బీసీసీఐ, ఐసీసీ సంస్థలే అతి పెద్ద ఉదాహరణ. ఒకప్పుడు నిధుల కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి ఇప్పుడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా క్రికెట్ బోర్డులు ఎదిగాయి. ఇదే విధంగా మరికొన్ని క్రీడలు కూడా కమర్షియలుగా టర్న్ అవుతాయి. ఇలాంటి వాటిని అందిపుచ్చుకోవాలి. అమరావతిలోని స్పోర్ట్స్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇదే విధంగా రూపొందించాం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలోకి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను తీసుకురావాలి అమరావతిలోకి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను తీసుకురావాలి. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇలాంటి వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉండాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సైబర్ సిటీలో పెట్టుబడులు పెట్టలేకపోయినందుకు డీఎల్ఎఫ్ వంటి సంస్థలు ఇప్పుడు చింతిస్తున్నాయి. ఈసారి అమరావతిలో అలాంటి అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నాయి. ఇది మన ప్రభుత్వానికి ఉన్న క్రెడిబులిటీ. ఈ బ్రాండ్ మరింతగా పెరగాలి. అందుకే పెట్టుబడులు పెట్టే వారిని రెగ్యులరుగా ఫాలో అప్ చేస్తూనే ఉండాలి. ఓవైపు రాజధానిలో పనులను త్వరితగతిన చేపట్టేలా పర్యవేక్షణ చేస్తూనే.. పెట్టుబడులు పెట్టే సంస్థలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉండాలి. అమరావతిలో నిర్మించబోతున్న తెలుగు కల్చరల్ సెంటర్ కు మంచి పేరును పరిశీలించండి. రాజధానిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయండి. ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఓ పెద్ద కన్వెన్షన్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉంది’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సీఎస్ సాయి ప్రసాద్, పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు పాల్గొన్నారు. 59వ సీఆర్డీఏ అథార్టీ ఆమోదం పొందిన అంశాలివే * సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపు * పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు కేటాయింపు * పంచాయితీరాజ్ విభాగంలోని ఏపీఎస్ఐఆర్డీకి 5 ఎకరాల కేటాయింపు * ఏపీ సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2316 కోట్లకు పరిపాలనా అనుమతులు. * రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *