రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్న మంత్రి లోకేష్​

*ఎందుకోసమంటే

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ సోమవారం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ సోమవారం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. లోకేష్‌తో పాటు పలువురు కూటమి నేతలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలవనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి చట్టబద్ధత లభించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ ఉభయసభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతి రైతులు కల నెరవేరింది. ఈ సందర్భంగా ప్రజల తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతిని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలవను న్నారు. ఇందుకోసం సోమవారం ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి నారా లోకేష్… రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆమెకు అమరావతి విశిష్టతలు తెలియజేసే బుక్ లెట్‌ను అందజేయను న్నారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే అంటూ సభ్యులు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయసభలకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అనంతరం లోక్సభలో ఏప్రిల్ 1న బిల్లు చర్చకు రాగా దాదాపు అన్నీ పార్టీలు మద్దతు తెలిపాయి. మరుసటి రోజున రాజ్యసభకు బిల్లుపై చర్చ జరగగా… అక్కడ కూడా దాదాపు అన్ని పార్టీల మద్దతుతో బిల్లుకు ఆమోదముద్ర పడింది. అయితే పార్లమెంట్ ఉభయ సభలలో ఈ బిల్లను వైసీపీ వ్యతిరేకించింది. ఇక, పార్లమెంట్ ఉభయసభలలో ఆమోదం పొందిన ఈ బిల్లను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లను పరిశీలించి ఏప్రిల్ 6న ఆమోదించారు. అదేరోజు రాత్రి ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ సైతం వెలువడింది. ఏపీ పునర్వ్య వస్థీకరణ చట్టం సబ్ సెక్షన్-2లో రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర న్యాయ శాఖ గెజిట్ విడుదల చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా కేంద్రస్థాయిలో చట్టబద్ధ రక్షణ లభించింది. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ద కల్పించే బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మ సంతకం చేసి ఆమోదించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాష్ట్రపతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.‘మన రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం 2026కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉండి, దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ, మా వెన్నంటే నిలిచిన ప్రతి పౌరునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయం’అని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *