అక్షర ఆయుధం : ‘గత పాలకులు మీ భూమిపైనే కన్ను వేసి కట్టడి చేయాలని, బ్లాక్ మెయిల్ చేయాలని ఆలోచన చేశారు. రికార్డులు తారుమారు చేసి, కబ్జాలకు, భూ వివాదాలకు తెరలేపారు. మీ ఆస్తిపై వారు బొమ్మలు వేసుకున్నారు. ఆస్తి మీది ఫోటో ఆయనది. ఇదెక్కడి చోద్యం?’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ‘గత పాలకులు రాష్ట్ర విభజన కంటే దారుణంగా రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. 2019-24 మధ్య దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చి ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సూరేపల్లిలో మీ భూమి – మీ హక్కు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతు నాంచారయ్యకు మీ భూమి-మీ హక్కు కింద పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందజేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శాశ్వతంగా భూ సమస్యల్ని పరిష్కారం చేసి భూమిని హక్కుగా మీకు కల్పించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పారదర్శక పాలనకు నాందిపలికాం ‘మేం అధికారంలోకి వచ్చే సమయానికి రోడ్లపైనే కాదు అన్ని చోట్లా గోతులే. ఎలా పూడ్చాలో తెలీదు. పెట్టుబడిదారులు పారిపోయారు. కానీ మేం 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం’అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని పనులు కూడా చేసి చూపిస్తున్నాం. సుపరిపాలన ఇవ్వాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాం. గాడి తప్పిన వ్యవస్థలను సంస్కరించి పారదర్శక పాలనకు నాందిపలికాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘రెవెన్యూ శాఖలో చేసిన విధ్వంసం కారణంగా దానిని పునరుద్ధరించడానికి ఇన్ని నెలలు పట్టింది. ప్రజల ఆస్తులకు భరోసా, ప్రజల జీవితాలకు విశ్వాసం కల్పించాలన్న కారణంగా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.శాశ్వతంగా భూ సమస్యలను పరిష్కరిస్తున్నాం ‘గత పాలకులు మీ భూమిపైనే కన్ను వేసి కట్టడి చేయాలని, బ్లాక్ మెయిల్ చేయాలని ఆలోచన చేశారు. రికార్డులు తారుమారు చేసి, కబ్జాలకు, భూ వివాదాలకు తెరలేపారు. మీ ఆస్తిపై వారు బొమ్మలు వేసుకున్నారు. ఆస్తి మీది ఫోటో ఆయనది. ఇదెక్కడి చోద్యం?’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ‘సరిహద్దు రాళ్లపై కూడా ఆయన బొమ్మ చెక్కించుకున్నాడు. ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. పాలకులు మంచిపని చేయాలి తప్ప ఇలాంటి పనికిమాలిన పనులు కాదు. వాళ్లు చేసిన పాపాలు, అక్రమాలు ఇంకా వెంటాడుతున్నాయి. 2019-24 మధ్య జరిగిన వ్యవహారాల కారణంగా పెద్ద ఎత్తున భూవివాదాలు వచ్చాయి. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల నుంచి వచ్చిన అర్జీల్లో ఎక్కువ శాతం రెవెన్యూ వ్యవహారాలవే. అందుకే శాశ్వతంగా భూ సమస్యల్ని పరిష్కారం చేసి భూమిని హక్కుగా మీకు కల్పించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మార్చి నాటికి సర్వే పూర్తి ‘2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తి చేసి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 16,816 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉంది, ఇప్పటికి 6,976 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి అయ్యింది’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘21.23 లక్షల పాస్ పుస్తకాలను పంపిణీ చేశాం. జూలై నాటికి మరో 9 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం. ఈ నెలలోనే 1,56,433 పాస్ పుస్తకాలు ఇచ్చాం. మరో 80 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం. ఎవరూ తారుమారు చేసే అవకాశం లేకుండా మీకు భూ యాజమాన్య హక్కు పత్రాలను ఇస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇనామ్ భూములకు 22 ఏ నుంచి విముక్తి ‘ఈ-కేవైసీ, ఆధార్ అనుసంధానంతో ఈ రికార్డును పటిష్టంగా తయారు చేసి పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. మీ రికార్డులు ఎవరూ ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భద్రత కల్పిస్తున్నాం. క్యూఆర్ కోడ్ తో మీ భూమి వివరాలు తెలుసుకునేలా ప్రత్యేకంగా ముద్రించాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘అలాగే ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని డిజిటల్ గా లాకింగ్ చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించాం. యజమానులు వచ్చి ఈ-కేవైసీ, ఆధార్తో అన్ లాక్ చేస్తే తప్ప మీ ఆస్తిని ఎవరూ తీసుకోలేరు. గత పాలకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ద్వారా బెదిరించి మీ ఆస్తుల్ని కాజేయాలని చూశారు. మేం అధికారంలోకి వస్తూనే ఆ చట్టాన్ని రద్దు చేసి మీకు న్యాయం చేశాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘గ్రామ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములను 22ఏ నుంచి 1.37 లక్షల ఎకరాలను తొలగిస్తున్నాం. మరో 1 లక్ష ఎకరాల సర్వీసు ఇనామ్ భూములను కూడా 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.