కుటుంబ భద్రతపై ఆందోళన

అమిత్ షాను ఆశ్రయించిన రాజా సింగ్

జనం న్యూస్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తనకు తరుచూ బెదిరింపులు వస్తున్న విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించిన రాజాసింగ్ తన కుటుంబానికి భద్రత కల్పించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తనకు తరుచూ బెదిరింపులు వస్తున్న విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించిన రాజాసింగ్ తన కుటుంబానికి భద్రత కల్పించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో తనకే కాకుండా, తన కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని. దీంతో తన కుటుంబం ప్రమాదంలో ఉందని రాజాసింగ్ ఆరోపించారు. చాలా కాలంగా ఫోక్ కాల్స్, లేఖల ద్వారా తరుచూ బెదిరింపులు వస్తూనే ఉన్నాయని తెలిపారు. కేవలం తనను మాత్రమే కాకుండా, తన కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేస్తూ బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. తనకు వస్తున్న బెదిరింపులకు అనేక సార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని రాజా సింగ్ పేర్కొన్నారు. అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహారించడంతో తాను, తన కుటుంబం తీవ్ర ప్రమాదంలో ఉన్నామని చెప్పారు. అయితే భద్రతకు సంబంధించి ఇదే తన నుంచి చివరి లేఖ అని రాజా సింగ్ పేర్కొన్నారు. తాను ఇకపై భద్రతా కల్పించాలని ఎలాంటి రిక్వెస్ట్ చేయనని తెలిపారు. తాను ఇంతకాలం సమన్వయంతో చట్టబద్దమైన ప్రక్రియ ద్వారా రక్షణ కల్పించాలని కోరానని. అయితే ఇప్పుడు తన సహనం నశించిందని తెలిపారు. తన కుటుంబ భద్రతకు అధికార యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజాసింగ్ పేర్కొన్నారు. తనకు వస్తున్న బెదిరింపు మూలాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ బెదిరింపుల వెనక ఉన్న వ్యక్తులు, సమూహాలకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అయితే తనకు చాలా కాలంగా బెదిరింపులు వస్తున్నాయని. ఇందుకు సంబంధించి గతంలో చేసిన ఫిర్యాదులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాజా సింగ్ ఆరోపించారు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఏదైనా హాని జరిగితే. తనను తాను రక్షించుకోవడానికి సిద్ధపడాల్సి వస్తుందని అన్నారు. ‘‘ఇంతకు ముందు కూడా నేను చాలా లేఖలు పంపాను. నా మొబైల్ నంబర్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి, నా కార్యాలయానికి బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ విషయంపై నేను మీకు, మీ కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉన్నాను. కానీ బదులుగా నాకు కేవలం ఒక రసీదు లేఖ మాత్రమే అందింది… ఇంకేమీ లేదు. గతంలో వచ్చిన బెదిరింపులపై ఎలాంటి తదుపరి చర్యలు లేవు. నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ వ్యక్తుల వల్ల నా కుటుంబానికి గానీ, నా కుటుంబ సభ్యులలో ఎవరికైనా గానీ ఏదైనా హాని జరిగితే, నేను మళ్లీ పోలీసుల వద్దకు వెళ్ళను. నేనే స్వయంగా ఆయుధం పట్టుకుని బాధ్యులను హతమారుస్తాను. ఆ తర్వాత ఏది జరిగినా, నా ఫిర్యాదులను పట్టించుకోని వారిదే బాధ్యత. మీరు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, వెంటనే చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని రాజా సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *