జనం న్యూస్: తెలంగాణలో పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం టీపీసీసీ సమన్వయ కమిటీ ని ఏఐసీసీ ఏర్పాటు చేసింది.8 మందితో కూడిన కమిటీని ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రకటించారు. పీసీసీ చీఫ్, సీఎంతోపాటు నలుగురు మంత్రులు, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్లకు ఈ కమిటీలో చోట్లు దక్కాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలతో సొంత పార్టీ సీనియర్లు సైతం ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వీరి వల్ల కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్న నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ప్రచారం ఉంది. మరోవైపు కొందరు నేతలు అయితే ఏకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగ విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.ఇలా నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం, పార్టీ సమన్వయం కోసం కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కో ఆర్డినేషన్పై కాంగ్రెస్ ఫోకస్ తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది.ప్రభుత్వం, పార్టీల మధ్య సమన్వయం కోసం కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. 8 మంది సభ్యులతో కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది ఏఐసీసీ. ఈ 8 మందితో కూడిన కమిటీని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ప్రకటించారు. ఈ కమిటీలలో చోటు దక్కించుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీ చంద్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఈ కమిటీ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయంతోపాటు సమర్ధవంతమైన పనితీరు, సజావుగా జనులు జరిగేలా పనిచేయనుంది. ఏఐసీసీ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు వీళ్లే టీపీసీసీ అధ్యక్షులు -మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి- రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి -భట్టి విక్రమార్క ఇరిగేషన్ మంత్రి- ఉత్తమ్ కుమార్ రెడ్డి సిడబ్ల్యుసి సభ్యులు మంత్రి – దామోదర రాజా నర్సింహా మంత్రి -సీతక్క సిడబ్ల్యుసి సభ్యులు- వంశీ చంద్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందని ఇక మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు. ప్రజా ప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిది అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.