జనం న్యూస్: హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజకీయ కురువృద్ధులు, కేంద్రమాజీమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు కావూరి సాంబశివరావును స్టార్ ఆస్పత్రిలో చేర్పించారు. స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. కావూరి సాంబశివరావు ఐదు సార్లు ఎంపీగా పనిచేశారు. 1984, 1989, 1998లో మచిలీపట్నం నుంచి 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా గెలుపొందారు.అనంతరం కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. కావూరి సాంబశివరావుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం.కేంద్రమాజీమంత్రి కావూరి సాంబశివరావుకు నాలుగు దశాబ్ధాలకుపైగా రాజకీయ చరిత్ర ఉంది. వివాదరహితుడిగా పేరుంది. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అధిరోహించిన కావూరి సాంబశివరావు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి దూరమయ్యారు. బీజేపీలో చేరారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మౌనం వహించారు. కావూరి సాంబశివరావు మృతితో పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. కేంద్రమాజీమంత్రి కావూరి కన్నుమూత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజకీయ కురువృద్ధులు, కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కావూరి సాంబశివరావు హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కావూరి సాంబశివరావు మృతిపట్ల పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర కలిగిన కావూరి సాంబశివరావు వినయశీలి, విద్యావంతుడు, మృదు స్వభావి, ఆలోచనా తత్పరుడుగా పేరుతెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కావూరి సాంబశివరావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇకపోతే మచిలీపట్నం లోక్సభ నుంచి మూడు సార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. 1989లో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ కావూరి సాంబశివరావు మాత్రం గెలుపొందారు.ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో జిల్లా మారిన ఆయన ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2013లో కేంద్ర జౌళిశాఖ మంత్రిగా కావూరి సాంబశివరావు పనిచేశారు.