మహానాడుపై టీడీపీ ఫుల్ ఫోకస్

ఈసారి పసుపు పండుగ గ్రాండ్‌గా

అక్షర ఆయుధం : టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని మహనాడు కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించాలని భావిస్తోంది. ప్రతీ ఏడాది కంటే ఈ ఏడాది అందుకు భిన్నంగా మహానాడును నిర్వహించాలనే యోచనలో ఉంది. ఈసారి మహానాడు వేదికగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు సంచలన ప్రకటనలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీ అత్యంత కన్నుల పండువగా నిర్వహించే కార్యక్రమం మహానాడు. ఈ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒక వేడుకలా జరుపుకుంటారు. ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని నిర్వహించే ఈ వేడుక అభిమానులకు ఒక పండుగ వాతావరణం అనే చెప్పాలి. ఈ మహానాడును ఈ ఏడాది మరింత జోష్‌లో నిర్వహించుకోవాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నో విజయాలను సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రకటించడం… రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడం ఒక విజయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఏపీకి భారీగా పెట్టుడులు తరలిరావడం వంటి గుడ్‌న్యూస్‌లతో టీడీపీ జోష్‌లో నెలకొంది. అందుకే ఈ ఏడాది నిర్వహించే మహానాడు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. మరింత జోష్‌లో మహానాడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏడాది తెలుగు తమ్ముళ్లు అత్యంత వైభవంగా నిర్వహించే మహానాడు ఈసారి మరింత ఘనంగా, చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు టీడీపీ సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో మహానాడు 2026 నిర్వహణకు అనువైన వేదిక ఎంపిక కోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు కీలక నేతలతో కలిసి పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఒకేరోజు మొత్తం తొమ్మిది అనువైన స్థలాలను పల్లా గారు పరిశీలించారు. వాస్తు అనుకూలత, విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, లక్షలాది మంది కార్యకర్తలు సౌకర్యవంతంగా పాల్గొనే అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి స్థలాన్ని సమగ్రంగా పరిశీలించినట్లు తెలిపారు. మహానాడు నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు ఉండేలా కసరత్తు జరుగుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఉత్తరాంధ్రలో స్థలాల పరిశీలన ఇకపోతే ఈ ఏడాది ఉత్తరాంధ్రలోనే మహనాడును నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో నిర్వహించే అంశంపై టీడీపీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పలు ప్రాంతాలను పల్లా శ్రీనివాసరావుతోపాటు టీడీపీ శ్రేణులు పరిశీలించారు. నాతవలస (విజయనగరం పార్లమెంట్), పైడిభీమవరం (ఎచ్చర్ల నియోజకవర్గం), పిసిని రోడ్–పాటివాడిపాలెం (రణస్థలం మండలం), సింగవరం (డెంకాడ మండలం, నెల్లిమర్ల నియోజకవర్గం) తదితర ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తూ, మౌలిక వసతులు, విస్తరణ అవకాశాలు, రవాణా అనుసంధానం వంటి అంశాలపై అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు.మహానాడు ఆత్మగౌరవ సభ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి మహానాడు ఆత్మగౌరవ సభ. పార్టీ ప్రతిష్టకు తగ్గట్టుగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచే విధంగా మహానాడు 2026ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నాం అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం, యువతిని ఆకర్షించేలా పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మంత్రి నారా లోకేశ్ కార్యచరణతో మహానాడు మరింత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబడుతుందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అన్ని అంశాలను సమీక్షించి తగిన వేదికను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. మహానాడు 2026ను పార్టీ చరిత్రలో మరో మైలురాయిగా నిలిపే దిశగా కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఈ పర్యటనలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ, జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, పిపిపి కిమిడి నాగార్జున, నెల్లిమర్ల ఇంచార్జి కర్రోతు బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *