రాష్ట్రంలో యువతకు రాయితీ రుణాలు

జనం న్యూస్: తెలంగాణలో రాజీవ్ యువ వికాసం‌ పథకం అమలు కోసం ఆశావహులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజీవ్ యువ వికాసం‌ పథకం అమలు కోసం ఆశావహులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రాజీవ్ యువ వికాసం పథకం కింద రాయితీతో కూడిన రుణాలు అందించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. రూ. 50 వేల నుంచి గరిష్టంగా రూ. 4 లక్షల వరకు వివిధ యూనిట్లకు రాయితీతో కూడిన రుణాలు పొందేందుకు పెద్ద ఎత్తున యువత దరఖాస్తులు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే తొలుత గతేడాది జూన్ 2న రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాలు జారీ చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ పథకం అమలు చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే అప్పటి నుంచి ఈ పథకం కోసం దరఖాస్తు చేసిన ఆశావహులు ప్రభుత్వం ఎప్పుడు మంజూరు పత్రాలు జారీ చేస్తుంది? తమ అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు పడతాయి? అని ఎదురుచూస్తున్నారు. అయితే రాజీవ్ యువ వికాసం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేకుండా పోయింది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రోజున అసెంబ్లీలో బడ్జెట్య 2026-27ను సమర్పించింది. ఇందులో వివిధ శాఖలకు కేటాయింపులతో పాటు అభివృద్ది పనులకు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన కేటాయింపులను కూడా ప్రస్తావించింది. ఈ క్రమంలో రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ పథకం అమలు కోసం ఈ బడ్జెట్‌లో రూ. 6 వేల కోట్లను ప్రతిపాదించినట్టుగా తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన యువతు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకంను ప్రవేశపెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. యువత ఆర్థిక స్వయం సమృద్దిని, వ్యవస్థాపక సామర్థ్యాలను పెంపొందించడానికి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేయనున్నట్టుగా చెప్పారు. ఈ పథకం అమలుకు రూ. 6 వేల కోట్లును బడ్జెట్‌లో ప్రతిపాదించామని చెప్పారు. దీంతో ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలోనైనా రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయాలని ఆశావహులు కోరుతున్నారు. ఇక, రాజీవ్‌ యువ వికాసం పథకం ద్వారా రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు రూ.6 వేల కోట్లు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. యువత స్వయం ఉపాధికి మద్దతు ఇవ్వడానికి రాయితీతో కూడా రుణాలు ఇవ్వనున్నట్టుగా పేర్కొంది. రాజీవ్ యువ వికాసం పథకానికి మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రూ.50 వేల లోపు రుణ పరిమితి యూనిట్లను కేటగిరీ–1గా, రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణ పరిమితి యూనిట్లను కేటగిరీ–2గా, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల రుణ పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–3గా, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య రుణ పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–4గా విభజించారు. రూ.50 వేల రుణానికి వందశాతం రాయితీ అందించనున్నారు. రూ.లక్ష వరకు రుణానికి 90 శాతం రాయితీ, రూ. 2 లక్షల వరకు రుణానికి 80 శాతం రాయితీ, రూ. 4 లక్షల వరకు రుణానికి 70 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈ పథకం కోసం 16.22 లక్షలకు పైగా దరఖాస్తుదారులు వచ్చినట్టుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *