ప్రజావాణి సేవలు క్షేత్రస్థాయికి విస్తరించాలి.

*సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

జనం న్యూస్ : ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.త్వరలోనే ప్రజావాణిని రెవెన్యూ డివిజన్ స్థాయి ఆ తర్వాత మండల స్థాయికి విస్తరించాలని ఆదేశించారు. మరోవైపు ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డిఈ ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రజావాణి అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రజావాణిని రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఆ తర్వాత మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజావాణి సేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలి రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజే 2023 డిసెంబర్ 8వ తేదీన ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతిభా ఫూలే ప్రజా భవన్లో ప్రజావాణి విజయవంతంగా అమలవుతోంది. అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే ప్రజలు ఇచ్చే అర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల అధ్వర్యంలో ప్రతి వారం ప్రజా వాణి నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్ కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం ఇకపోతే త్వరలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తరువాత దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సూచించారు. ప్రజా వాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలని, సంబంధిత విభాగాలకు పంపించాలని, పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువులు ఉండాలని, ఆలస్యం జరగకూడదని చెప్పారు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులు ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే, పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *