
పయనించే సూర్యుడు న్యూస్ : భారతదేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన మైలురాయిగా భావించే ఎస్-400 (S-400) వాయు రక్షణ క్షిపణి వ్యవస్థల సరఫరాలో మరో కీలక అడుగు పడింది. భారతదేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన మైలురాయిగా భావించే ఎస్-400 (S-400) వాయు రక్షణ క్షిపణి వ్యవస్థల సరఫరాలో మరో కీలక అడుగు పడింది. హిందుస్థాన్ టైమ్స్కు విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన నివేదిక ప్రకారం, రష్యా నుండి నాల్గవ ఎస్-400 వ్యవస్థ మే నెల మధ్య నాటికి భారత్కు చేరుకోనుంది. సరిహద్దుల్లో మారుతున్న వ్యూహాత్మక పరిస్థితుల దృష్ట్యా, గగనతల రక్షణను మరింత పటిష్టం చేసేందుకు ఈ పరిణామం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భారత వైమానిక దళ (IAF) అధికారులు రష్యాలో ఈ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించి, రవాణాకు ముందు అన్ని రకాల సాంకేతిక తనిఖీలను పూర్తి చేశారు. గత వారమే రష్యా నుండి బయలుదేరిన ఈ వ్యవస్థను రాజస్థాన్ సెక్టార్లో మోహరించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ప్రధానంగా పాకిస్థాన్ వైపు నుండి ఎదురయ్యే క్షిపణి, వైమానిక దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి రాజస్థాన్ సరిహద్దుల్లో దీని మోహరింపు భారత్కు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. 'ఆపరేషన్ సింధూర్' వార్షికోత్సవానికి ఒక రోజు ముందు ఈ డెలివరీ జరగడం విశేషం. ఎస్-400 వ్యవస్థ సామర్థ్యం అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ఫ్రూవ్ అయ్యింది. ఈ వ్యవస్థ సుమారు 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను గుర్తించి గగనతలంలోనే ముక్కలు ముక్లు చేయగలదు. నివేదికల ప్రకారం, ఇప్పటివరకు భారతదేశం ప్రయోగించిన 11 సుదూర శ్రేణి క్షిపణులు యుద్ధ విమానాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలతో (AWACS) సహా పలు వైమానిక ముప్పులను విజయవంతంగా నిర్వీర్యం చేశాయి. ప్రస్తుత ఒప్పందంలో భాగంగా ఐదవ, చివరి వ్యవస్థ ఈ ఏడాది నవంబర్లో భారత్కు చేరనుంది. దీనికి అదనంగా మరో ఐదు వ్యవస్థల కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంతో, కేవలం క్షిపణుల కొనుగోలుకే పరిమితం కాకుండా వాటి నిర్వహణపై కూడా భారత్ దృష్టి పెట్టింది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ద్వారా దేశీయంగానే ఒక నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్హాల్ (MRO) కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషిస్తోంది. దీనివల్ల సాంకేతిక పరిజ్ఞాన బదిలీ (ToT) జరగడమే కాకుండా, భవిష్యత్తులో ఈ వ్యవస్థల మరమ్మత్తుల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది. దీనికి తోడు, తక్కువ శ్రేణి ముప్పులను ఎదుర్కోవడానికి రష్యా నుండి 12 పాంట్సిర్ (Pantsir) వ్యవస్థలను సేకరించాలని, మరో 40 వ్యవస్థలను 'మేక్ ఇన్ ఇండియా' కింద దేశీయంగా తయారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రక్షణ సంసిద్ధతను మరింత వేగవంతం చేస్తూ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ సేకరణ మండలి (DAC) సుమారు రూ. 2.38 లక్షల కోట్ల విలువైన రక్షణ ప్రతిపాదనలకు 'అవసరమైన ఆమోదం' (AoN) మంజూరు చేసింది. ఈ భారీ నిధులతో ఎస్-400 క్షిపణులతో పాటు, భారత వైమానిక దళంలోని పాత ఏఎన్-32, ఐఎల్-76 విమానాల స్థానంలో అత్యాధునిక మధ్య తరహా రవాణా విమానాలను చేర్చనున్నారు. అలాగే, శత్రువుల కదలికలను కనిపెట్టడానికి రిమోట్గా నడిపించే స్ట్రైక్ విమానాలను కూడా సేకరించబోతున్నారు. సైన్యం, తీర రక్షక దళాల ఆధునీకరణకు కూడా ఈ సమావేశంలో పెద్దపీట వేశారు. యుద్ధరంగంలో సమాచార మార్పిడిని మెరుగుపరిచేందుకు ధనుష్ గన్ సిస్టమ్ మరియు ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్ సిస్టమ్ వంటి పరికరాలకు ఆమోదం లభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఆధునీకరణ కోసం రికార్డు స్థాయిలో రూ. 6.73 లక్షల కోట్ల విలువైన 55 ప్రతిపాదనలను డీఏసీ ఆమోదించింది. ఇది భారత రక్షణ చరిత్రలోనే ఒకే ఏడాదిలో జరిగిన అత్యధిక వ్యయంగా నిలవనుంది. తీరప్రాంత నిఘా కోసం భారీ ఎయిర్ కుషన్ వాహనాలను సేకరించడం ద్వారా సముద్ర భద్రతను కూడా పటిష్టం చేయనున్నారు.