
జనం న్యూస్: కేవలం గల్ఫ్ దేశాలు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల నుంచి కూడా భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పవచ్చు. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ లభించే దేశాలలో గల్ఫ్ దేశాల తర్వాత దక్షిణ అమెరికా, ఆ తర్వాత ఆఫ్రికా దేశాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పవచ్చు. ఇరాన్ అమెరికా మధ్య చెలరేగిన యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సమస్య ఏర్పడింది. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసివేయడంతో ఒకసారిగా ప్రపంచ ఇంధన మార్కెట్లో కల్లోలం ఏర్పడింది. ప్రధానంగా భారత్, చైనా వంటి దేశాలు తమ ఇంధన అవసరాల్లో 90% దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్, చైనా ప్రత్యక్షంగా ఇంధన కొరత సమస్యను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఇరుదేశాలు ప్రారంభించాయి. అయితే ప్రధానంగా భారత్ క్రూడాయిల్ దిగుమతుల్లో ప్రపంచంలోనే రెండవ అగ్రగామి దేశంగా ఉంది అని చెప్పవచ్చు. భారత్ క్రూడ్ ఆయిల్ అవసరాల్లో దాదాపు 90% పైన ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. అందులో గల్ఫ్ దేశాల నుంచి సుమారు 70 నుంచి 80 శాతం వరకు దిగుమతి అవుతున్నట్లు గమనించవచ్చు. ప్రస్తుతం గల్ఫ్ సంక్షోభం కారణంగా తలెత్తిన సరఫరా కొరత కారణంగా దేశంలో ఇంధన సరఫరాలో కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మరోసారి తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది అని చెప్పవచ్చు. కేవలం గల్ఫ్ దేశాలు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల నుంచి కూడా భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పవచ్చు. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ లభించే దేశాలలో గల్ఫ్ దేశాల తర్వాత దక్షిణ అమెరికా, ఆ తర్వాత ఆఫ్రికా దేశాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పవచ్చు. భారత్ చూపు ఆఫ్రికా వైపు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఆఫ్రికాలోని పలు దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు అని చెప్పవచ్చు. ఆఫ్రికాలోని పలు దేశాల్లో క్రూడ్ ఆయిల్ ఎగుమతి ప్రధాన వ్యాపారంగా మారుతుంది అని చెప్పవచ్చు. ఆఫ్రికా దేశాల్లో ముఖ్యంగా నైజీరియా అత్యంత కీలక భాగస్వామిగా చెప్పవచ్చు. నైజీరియా నుంచి భారత్ పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు భారత్ తన అవసరాల్లో సుమారు 10% పైనే క్రూడ్ ఆయిల్ నైజీరియా నుంచి దిగుమతి చేసుకునేది. నైజీరియాలో లభించే క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ చేసేందుకు అత్యంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆఫ్రికా ఖండంలో మరొక ప్రధాన దేశం అంగోలా. 2024 సంవత్సరం నుంచి భారత అంగోలా నుంచి పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. గడచిన రెండు సంవత్సరాలుగా గమనించినట్లయితే భారత్ అంగోలా దేశం నుంచి సుమారు 6 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్నట్లు చెప్పవచ్చు.