తెలంగాణ కులగణన నివేదిక విడుదల: బీసీలు అగ్రస్థానంలో

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక,ఆర్థిక, విద్య, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా మొత్తం కోటి 12 లక్షల 36 వేల 849 కుటుంబాలను సందర్శించి సర్వే చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అంటే దాదాపు 97.10 శాతం సర్వేను పూర్తి చేసినట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ మరియు కుల సర్వే (SEEEPC)ను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కుల గణను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసిన రాష్ట్రంగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా అత్యంత పారదర్శకమైన పద్ధతుల్లో ఈ కుల గణన ప్రక్రియను పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. సమాజంలో సమానత్వం సాధించడానికి కులగణన వంటి కీలక నిర్ణయాలు అవసరమని 97.10 శాతం సర్వే పూర్తి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక,ఆర్థిక, విద్య, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా మొత్తం కోటి 12 లక్షల 36 వేల 849 కుటుంబాలను సందర్శించి సర్వే చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అంటే దాదాపు 97.10 శాతం సర్వేను పూర్తి చేసినట్లు తెలిపింది.ఈ చారిత్రాత్మక సర్వేలో ఒక లక్షా మూడు వేల మంది ప్రభుత్వ సిబ్బందిని భాగస్వాములను చేసి, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ‘సెల్ఫ్ డిక్లరేషన్’ పద్ధతిలో సమాచారాన్ని సేకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సర్వే ద్వారా మొత్తం 3 కోట్ల 55 లక్షల 50 వేల 759 మంది జనాభా వివరాలను పకడ్బందీగా క్రోడీకరించారు. రాష్ట్ర జనాభాలో బీసీలు 56.36 శాతం ఇకపోతే ఈ సర్వే ద్వారా వెల్లడైన సామాజిక వర్గాల బలాబలాలను పరిశీలించగా రాష్ట్రంలో అత్యధిక శాతం మంది బీసీ జనాభా ఉన్నట్లు స్పష్టమౌతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం జనాభాలో బీసీలు 56.36 శాతంగా ఉండగా, ఎస్సీలు 17.42 శాతం, ఓసీ వర్గాలు 15.79,ఎస్టీలు 10.43 శాతంగా నమోదయ్యాయి.అయితే ఈ సర్వేలో 4 శాతం మంది ప్రజలు తమకు ఎలాంటి కులం లేదు అని పేర్కొనడం విశేషం. ఈ గణాంకాలు భవిష్యత్తులో రాష్ట్రంలో రిజర్వేషన్ల ఖరారుకు మరియు సంక్షేమ పథకాల రూపకల్పనకు దిక్సూచిగా మారే అవకాశం లేకపోలేదు. కులాల వారీగా నివేదిక ఇదే కులాల వారీగా జనగణన వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం 36.58 లక్షల మందితో (10.3%) రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత షేక్ ముస్లింలు 27.96 లక్షలతో (7.9%), ముదిరాజ్ వర్గం 26.39 లక్షలతో (7.4%) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మాదిగ సామాజిక వర్గం 36.58(10.3శాతం) లక్షల మంది షేక్ ముస్లింలు 27.96(7.9శాతం) లక్షల మంది ముదిరాజ్ వర్గం 26.39(7.4శాతం) లక్షల మంది లంబాడ/బంజారా (6.8%), యాదవ (5.7%) రెడ్డి (4.8%) గౌడ్ (4.6%) మాల (4.1%) మున్నూరుకాపు (3.9%) ఈ సమగ్ర సర్వే వివరాలన్నింటినీ సామాన్య ప్రజల అందుబాటు కోసం des.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఉంచింది ప్రభుత్వం. దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా ఉంది: పొన్నం ప్రభాకర్ ఈ సర్వేను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కోటి 20లక్షల ఇళ్లకు సంబంధించి సర్వే చేశాం అని పేర్కొన్నారు. 3 కోట్ల 55 లక్షల మంది వివరాలు ఇచ్చారని తెలిపారు.వివరాలు అన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా ఉంది.కేంద్రం మా సర్వే డేటా పరిగణనలోకి తీసుకోవాలి అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం:మంత్రి వాకిటి శ్రీహరి కులగణన వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం ద్వారా పారదర్శకతకు, సామాజిక న్యాయానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా కులగణనపై మాటలకే పరిమితమైన కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యస్పదమన్నారు. నిజమైన డేటా బయటకు వస్తే వారి రాజకీయ అసత్యాలు బహిర్గతమవుతాయని భయంతోనే ఈ విమర్శలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వెనుకబడిన వర్గాల వాస్తవ పరిస్థితులు స్పష్టంగా బయటపడతాయని, ఇప్పటి వరకు కేవలం వాగ్దానాలకే పరిమితమైన నాయకుల నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతుందని మంత్రి తెలిపారు. కులగణన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచడం వల్ల అభివృద్ధి పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరేలా చేయడం సులభమవుతుందని అన్నారు. కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిజాయితీతో, ధైర్యంగా ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. “సామాజిక న్యాయం గురించి మాట్లాడేవారు ముందుగా పారదర్శకతను ఆచరించాలి” అని ఆయన హితవు పలికారు. పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం మా చిత్తశుద్ధికి నిదర్శనం సమాజంలో సమానత్వం సాధించడానికి కులగణన వంటి కీలక నిర్ణయాలు అవసరమని, ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా పనిచేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, అన్ని వర్గాల అభ్యున్నతిని సాధించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.