
జనం న్యూస్ : హర్మూజ్ జలసంధిని క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఇది మేలు చేస్తుందని...ఆ దేశాలకు ఈ పని చేసే ధైర్యం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణలో ఇరాన్ భారీగా నష్టపోతోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జల సంధి మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాలపాటు యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాయి ఇరు దేశాలు. ఇరాన్పై కాల్పులను విరమించినట్లు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించాయి. అటు ఇరాన్ సైతం కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటున్నట్లు తెలిపారు. దీంతో హర్మూజ్ జల సంధి వద్ద లైన్ క్లియర్ అయ్యింది.చమురు రవాణా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన రెండు యుద్ధనౌకలు హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించాయి.ఈ సందర్భంగా హర్మూజ్ జల సంధిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కీలకమైన జలమార్గాన్ని క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించామని ప్రకటించారు. హర్మూజ్ జల సంధి క్లియర్ అమెరికా నేవీకి చెందిన గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జలసంధిని దాటినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. అయితే ఈ ఆపరేషన్ కోసం టెహ్రాన్ అధికారులతో ఎలాంటి సమన్వయం చేసుకోలేదని యాక్సియోస్ అనే మరో మీడియా సంస్థ పేర్కొంది.ఈ అంశంపై తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా ట్రంప్ స్పందించారు. హర్మూజ్ జలసంధిని క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఇది మేలు చేస్తుందని...ఆ దేశాలకు ఈ పని చేసే ధైర్యం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణలో ఇరాన్ భారీగా నష్టపోతోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఇరాన్ సముద్రంలో అమర్చిన మైన్ల వల్ల ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని ట్రంప్ అంగీకరించారు. భారత్ చేరుకున్న జగ్ విక్రమ్ ఎల్పీజీ ట్యాంకర్ మరోవైపు రెండు వారాలపాటు యుద్ధానికి బ్రేక్ ఇవ్వడంతో హర్మూజ్ జల సంధిలో నిలిచిపోయిన నౌకాల రవాణా నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తోంది. ఇందులో భాగంగా భారత ‘జగ్ విక్రమ్’అనే ఎల్పీజీ ట్యాంకర్ కీలకమైన హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ మార్గంలో ప్రయాణించిన తొలి భారత నౌక ఇదే కావడం విశేషం. షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం జగ్ విక్రమ ట్యాంకర్ శనివారం మధ్యాహ్నానికి ఒమన్ సింధుశాఖలోకి ప్రవేశించి, తూర్పు దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ముంబైకి చెందిన గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ యాజమాన్యంలోని ఈ నౌక దాదాపు 20,000 టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తున్నట్లు వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.