ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు

ఏపీలో ఎండలు, పిడుగులు కలిసొస్తున్న ప్రమాదకర పరిస్థితి

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు రాష్ట్రంలో ఒకవైపు ఎండ తీవ్రత ఉంట మరోవైపు పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఎండ తీవ్రత, వడగాల్పులు, ఉక్కపోత పట్లప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో ఎండతీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఈ సీజన్లో గరిష్ఠ ఉష్ణోగ్రత కాకినాడ జిల్లా కరపలో 44.1°C, కడపలో 43.6°C నమోదైందని అలాగే 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. కడపలో 19 మండలాలు, నంద్యాలలో 11, మార్కాపురంలో 7, ఎన్టీఆర్ లో 4, ఇతర జిల్లాల్లో కలిపి మొత్తంగా 67 మండలాల్లో 41°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు. రేపు 66 మండలాల్లో తీవ్ర వడగాల్పులు శనివారం (11-04-26) ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపు శ్రీకాకుళం 8, విజయనగరం 20, పార్వతీపురంమన్యం 14, అల్లూరి 1, పోలవరం 6, అనకాపల్లి 5, కాకినాడ 2, తూర్పుగోదావరి 4, ఏలూరు 3, ఎన్టీఆర్ 3 మండలాల్లో(66) తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే 79 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. ఆదివారం మొత్తంగా 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్న మండలాల పూర్తి వివరాలు లింక్‌లో కరపలో అత్యధిక ఉష్ణోగ్రత 44.1°C శుక్రవారం కాకినాడ(జి) కరపలో 44.1°C, కడపలో 43.6°C, పశ్చిమగోదావరి(జి) పోడూరులో 42.9°C, తిరుపతి (జి) వరదయ్యపాలెంలో 42.8°C, ఎన్టీఆర్ (జి) మోగులూరులో 42.6°C, కృష్ణా(జి) పెదపారుపూడి, నంద్యాల(జి) బనగానపల్లిలో 42.3°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెం, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 42.1°C, విజయనగరం(జి) తుమ్మికపల్లిలో 42°C, కర్నూలు(జి) తోవిలో 41.5°C, అనంతపురం(జి) భట్టువానిపల్లి, మార్కాపురం(జి) పెద్దరావీడు, పల్నాడు(జి) అమరావతి, పోలవరం(జి) కూనవరంలో 41.4°C, పార్వతీపురంమన్యం(జి) భామినిలో 41.2°C, ప్రకాశం(జి) కొప్పెరపాడు, శ్రీసత్యసాయి(జి) తలుపులలో 41°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. జాగ్రత్తలు తీసుకోండి ఎండలో బయటకు వెళ్లేప్పుడు తలకి టోపి పెట్టుకోవాలని, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు మరోవైపు తెలంగాణ, రాయలసీమ,తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల క్రింద నిలబడరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.