చంద్రన్నను ఇంటికి ఆహ్వానించిన మహిళ

సీఎం స్పందన అందరిని కదిలించింది

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ మహిళకు మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. ‘‘చంద్రన్నా మా ఇంటికి రా అన్నా’’ అని చంద్రబాబును ఆ మహిళ తమ ఇంటికి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ మహిళకు మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. ‘‘చంద్రన్నా... మా ఇంటికి రా అన్నా’’ అని చంద్రబాబును ఆ మహిళ తమ ఇంటికి ఆహ్వానించారు. ఇందుకు చంద్రబాబు కూడా తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పీ4 వార్షికోత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలను రూపుమాపి, పేదల జీవన ప్రమాణాలను పెంచడమే పీ4 లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, సమాజంలో అసమానతలను తగ్గించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన పీ4 కార్యక్రమం ఏడాది పూర్తైనందుకు సంతోషంగా ఉందనది తెలిపారు. పేదరికం లేని సమాజం కోసం మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో నిస్వార్ధంగా సేవ చేసిన వారందరికీ వందనం చూస్తున్నానని, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి అయ్యారు. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలోని గుండ్లసముద్రం ఎస్టీ కాలనీ చెందిన పంజా సుబ్బమ్మ చంద్రబాబు వద్దకు వచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘మాకు సాయం చేయడానికి టీవీఎస్ ట్రస్ట్ ముందుకొస్తే 3 నెలల దాకా నమ్మలేదు వెళ్లలేదు. అయినా పదేపదే మాతో మాట్లాడి మాకు నమ్మకం కల్పించారు. మూడు నెలల తర్వాత నమ్మి మా ఆధార్ కార్డులతో బయటకు వచ్చాం. ఇళ్లనుంచి రావాలంటే కాల్వ దాటాలి. ముందు కాల్వపై వారధి నిర్మించారు. గ్రామంలోని నీరు తాగే నలుగురు చనిపోయారు. మంచి నీళ్లివ్వండి. ఉప్పు నీళ్లు తాగి ఇబ్బందులు పడుతున్నామని చెప్పాం. వెంటనే వాటర్ ప్లాంట్ కట్టించారు. తర్వాత ఆరోగ్యంగా ఉండగలిగాం. ఖాళీగా ఉండకుండా 9 గొర్రెలు, ఒక పొట్టేలు, 10 కోళ్లను అందించారు. వ్యాధులు వస్తున్నాయని వైద్య పరీక్షలు, కళ్ల ఆపరేషన్ చేయించారు. మాకు ఉండేందుకు ఇళ్లు కట్టించారు. గతంలో మా ఇళ్లకు వచ్చిన చుట్టాలు ఈ ఎడారి, అడవుల్లో ఎలా ఉంటున్నారని గేలిగా మాట్లాడారు. కానీ ఇప్పుడు టీవీఎస్ సంస్థ వాళ్లు కట్టించిన ఇళ్లు మమ్మల్ని గేలిచేసిన వారి ఇళ్లకంటే బాగున్నాయి. నీళ్లు, విద్యుత్, రహదారులు మాకు ఇస్తున్నారు. ఊర్లో ఇంటిచుట్టూ గొర్రెలు, మేకలు, ఇళ్లను చూసుకుంటుంటే కడుపు నిండిపోతోంది. మాకు ఊర్లో రచ్చబండ కట్టించడన్నా, చంద్రన్నా మా ఇంటికి రా అన్నా నువ్వు బాగుంటే మేం బాగుంటాం’’ అని సుబ్బమ్మ పేర్కొన్నారు. సుబ్బమ్మ బంగారు కుటుంబం లబ్దిదారుగా ఉన్నారు. అయితే ఈ విధంగా సుబ్బమ్మ తమ ఇంటికి రావాల్సిందిగా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. సుబ్బమ్మ మాటలపై స్పందించిన చంద్రబాబు వారి ఊర్లో కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, తప్పకుండా మీ ఊరికి వస్తా.. అతిథిగా వస్తా.. నీ ఆనందం, మీ ఊరి ఆనందం చూడటానికి వస్తా. ఓ వందమందికి సరిపడేలా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం’’ అని చంద్రబాబు ఆమెకు మాటిచ్చారు.