
అక్షర ఆయుధం ; విశాఖపట్నంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తనకు పరిచయం ఉన్న మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమెను శరీరాన్ని ముక్కలుగా చేసి... కొన్ని భాగాలను బయటపడవేయగా, మిగిలిన వాటిని ఫ్రిడ్జిలో దాచిపెట్టాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని నేవీ ఉద్యోగి చింతాడ రవీంద్ర (35)గా, బాధిత మహిళను 29 ఏళ్ల మౌనికగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అతడు విశాఖపట్నం నగరంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్వీ నగర్లో ఓ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నాడు.రవీంద్రకు ఇదివరకే పెళ్లి అయింది. రవీంద్ర భార్య కొన్ని వారాల క్రితం విజయనగరంలోని పుట్టింటికి వెళ్లారు. రవీంద్రకు గతంలోనే విశాఖపట్నంకు చెందిన మౌనికతో పరిచయం ఉంది. అయితే ఇటీవల మౌనికను ఇంటికి పిలిపించుకున్నాడు. రవీంద్ర నుంచి ఫోన్ కాల్ రావడంతో మౌనిక ఆదివారం మధ్యాహ్నం అతని ఇంటికి వెళ్లింది. అయితే ఈ క్రమంలోనే రవీంద్ర, మౌనికల మధ్య గొడవ జరిగినట్టుగా సమాచారం.ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన రవీంద్ర... మౌనికపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మౌనిక శరీరాన్ని ముక్కలు చేశాడు. అనంతరం మౌనిక శరీర భాగాలలో కొన్నింటిని ఒక సంచిలో ప్యాక్ చేసి, ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి పడేశాడు. మిగిలిన వాటిని ఇంట్లోని ఫ్రిజ్లో ఉంచినట్టుగా తెలుస్తోంది. అనంతరం రవీంద్ర పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. తాను మౌనికను హత్య చేసినట్టుగా చెప్పారు.ఈ క్రమంలోనే పోలీసులు రవీంద్రను అతడి నివాసం ఉంటున్న ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్లో రెండు మూటల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే మౌనిక తలభాగం కనిపించలేదని తెలుస్తోంది. మౌనిక తలను రవీంద్ర వేరే చోట పారవేసి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. తలతో పాటు ఇంట్లో గుర్తించని మిగిలిన శరీర భాగాల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక నేవీ ఉద్యోగి ఈ విధంగా ఘాతుకానికి పాల్పడటంపై పలువురిని విస్మయానికి గురిచేస్తుంది.అయితే రవీంద్ర, మౌనికల వివాహేతర సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మౌనిక డబ్బుల కోసం వేధించిందని, ఆ హింస భరించలేకే హత్య చేసినట్టుగా రవీంద్ర పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.