జనం న్యూస్: ‘లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో 50 శాతం మేరకు సీట్లను పెంచాలన్న నిర్ణయం ఏ ప్రాతిపదికన చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రక్రియ వల్ల ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని మరింతగా పెంచే ప్రయత్నాలను విరమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం రాష్ట్రాల వారిగా ఉన్న లోక్సభ స్థానాల నిష్పత్తిలోనే నియోజకవర్గాలను పెంచాలని సూచించారు.ప్రస్తుతం ఉన్న స్థానాలకు 50 శాతం సీట్లు పెంచుతూ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే, రేపటి రోజున జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండదని విశ్లేషించారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండా పోతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.ఒక ప్రముఖ ఛానెల్లో ‘భారతదేశం - ప్రపంచం’ అన్న ఇతివృత్తంపై “వాట్ ఇండియా థింక్స్ టుడే” సమ్మిట్ 2026 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన, మూసీ నది ప్రక్షాళన, తెలంగాణ విజన్ 2047, పరిపాలన, రాజకీయ స్థితిగతులపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 50శాతం సీట్ల పెంపు ప్రతిపాదనపై సీఎం అభ్యంతరం. ‘లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో 50 శాతం మేరకు సీట్లను పెంచాలన్న నిర్ణయం ఏ ప్రాతిపదికన చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రక్రియ వల్ల ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తొలుత అఖిల పక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయం మేరకు మార్గదర్శకాలు రూపొందించాల్సిందని అన్నారు. అలా కాకుండా ముందే నిర్ణయం తీసుకుని, తర్వాత అందరి అభిప్రాయాలు అడగడటం సమంజసం కాదని అన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలనే మేం కోరుకుంటున్నామని చెప్పారు. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలే కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురికావడమే కాకుండా తీరని నష్టం జరుగుతుందని అన్నారు. మంచి ఎక్కడున్నా స్వీకరిస్తామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు మూడు బుల్లెట్ ట్రెయిన్లు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పానని గుర్తుచేశారు. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత సమస్యను ఎదుర్కొనడానికి కార్యాచరణ ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో పెరగనున్న లోక్సభ, అసెంబ్లీ స్థానాలు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ, రాజ్యసభ స్థానాల సంఖ్య పెరగడంతోపాటు ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కూడా త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ బిల్లు పాసైతే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 కాగా ఆ సంఖ్య 179కి పెరిగే అవకాశం ఉంది. 50 శాతం పెరగనున్న అసెంబ్లీ స్థానాలు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని ప్రస్తుత అసెంబ్లీ స్థానాల సంఖ్య కంటే 50 శాతం పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాలతోపాటు పార్లమెంట్ స్థానాలను కూడా పెంచాలనే యోచనలో కేంద్రం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీయే సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం సూచనప్రాయంగా తెలియజేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖమంత్రి అర్జున్రామ్ మేఘవాల్ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించినట్లు సమాచారం. త్వరలోనే కాంగ్రెస్ పార్టీతోనూ ఈ సీట్ల పెంపు అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.