ట్రంప్‌తో ప్రధాని మోదీ టెలిఫోన్ సంభాషణ.. హర్మూజ్ జలసంధిపై చర్చ

పయనించే సూర్యుడు న్యూస్ : గత నెల 28న మొదలైన పశ్చిమాసియా యుద్ధం కారణంగా హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడంతో నెలకున్న పరిస్థితులతో ప్రపంచంలో ఇంధన సంక్షోభం దిశగా సాగుతోంది. ఈ క్రమంలో ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారి మోదీకి అమెరికా అధినేత ఫోన్ చేశారు. ఈ సందర్భంగా హర్మూజ్‌ గురించి ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఇక, ట్రంప్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని ప్రధాని మోదీ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. ఇరువురు నేతలూ మధ్య హర్మూజ్ జల సంధి తెరిచి ఉంచాల్సి ప్రాముఖ్యతో సహా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి గురించి చర్చించారని భారత్ అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. ఇరాన్‌తో ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం మొదలైన తర్వాత మోదీ, ట్రంప్ ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఇక, ట్రంప్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిన విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. ‘‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాకు ఫోన్ చేశారు.. మా ఇరువురం మధ్య పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులపై విలువైన అభిప్రాయాలను పంచుకున్నాం.. ఉద్రిక్తతలను తగ్గించుకుని, వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుంది. హర్మూజ్ జలసంధి తెరిచి, సురక్షితంగా అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచానికి అత్యవసరం. శాంతి, స్థిరత్వం దిశగా చేసే ప్రయత్నాలలో భాగంగా సంప్రదింపులు కొనసాగించాలని మేము అంగీకరించాం’’ అని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు కోసం ఇరాన్‌తో చర్చలు జరిపినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన మర్నాడే ట్రంప్-మోదీల మధ్య ఈ సంభాషణ జరిగింది. చర్చలు ముందుకు సాగేందుకు వీలుగా, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని తాను ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి మొదలైన యుద్ధంతో ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపడంతో తాత్కాలికంగా దాడులను నిలిపివేసినట్టు అగ్రరాజ్యాధినేత ప్రకటించారు. కాగా, దీనికి ముందు ప్రధానమంత్రి పార్లమెంటుతో మాట్లాడుతూ.. ఈ యుద్ధం తీవ్రమైన ఇంధన సంక్షోభానికి దారితీసిందని చెప్పారు. ఇప్పుడు ఈ యుద్ధం, ఇంధనం, గ్యాస్, ఎరువులు వంటి నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం కలిగించిందని ఆయన అన్నారు. వీటిని ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి భారీ పరిమాణంలో భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఈ దేశాలన్నీ ఇరాన్ సైనిక దాడులకు గురయ్యాయి. అయితే, భారత్ వద్ద తగినంత ముడి చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రధాని తెలిపారు. తాను వివిధ గల్ఫ్ దేశాలకు చెందిన నాయకులతో మాట్లాడానని, యుద్ధాన్ని ముగించి, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి ఆవశ్యకత గురించి వారితో చర్చించానని ప్రధాని తెలిపారు. వాణిజ్య నౌకలపై దాడులు, అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకాలు కలిగించడం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు.