శ్రీవారి పాదసన్నిధిలో సీఎం కుటుంబం

అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు

జనం న్యూస్: తిరుమల శ్రీవారి పాదసన్నిధిలో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం తరించింది. నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, దేవాన్ష్‌లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదానం ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం అందజేశారు.ప్రతీ ఏడాది మనవడు దేవాన్ష్ పుట్టిన రోజున ఒక రోజు అన్నప్రసాదానికి విరాళం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి దర్శనం అనంతరం వెంగమాంబ అన్నదాన కాంప్లెక్సులో భక్తులకు అన్నప్రసాదాన్ని సీఎం కుటంబ సభ్యులు వడ్డించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమల విచ్చేసిన సీఎం కుటుంబం, భక్తిశ్రద్ధలతో శ్రీవారిని కొలుచుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు, మంత్రి నారా లోకేష్, మనవడు దేవాన్ష్ ఉన్నారు. దర్శనం అనంతరం టీటీడీ వేద పండితులు సీఎం కుటుంబానికి వేదాశీర్వచనమిచ్చారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కుటుంబం ఒక రోజు అన్నదానానికి అయ్యే ఖర్చు రూ.44 లక్షలను అన్నదాన ట్రస్టుకు విరాళంగా అందజేశారు. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి ప్రతీ ఏడాది విరాళమిచ్చే సంప్రదాయాన్ని చంద్రబాబు కుటుంబం పాటిస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటివరకు 12 సార్లు విరాళమిచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో మహా ద్వారా ప్రవేశం ద్వారా నేరుగా ఆలయంలోకి వెళ్లే వెసులుబాటు ఉన్నప్పటికీ సామాన్య భక్తుని మాదిరిగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకున్నారు. తొలిసారి సీఎం అయినప్పటి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే శ్రీవారి దర్శనం చేసుకుంటున్న సీఎం ఇప్పటికీ అదే ఆనవాయితీని పాటిస్తున్నారు. ఎప్పటిలా సామాన్య భక్తుని మాదిరిగానే శ్రీవారి పట్ల తనకున్న భక్తిని చాటుకున్నారు. అన్న ప్రసాదం అందిస్తూ భక్తుల సౌకర్యాలపై ఆరా తీస్తూ శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం నుంచి కాలినడకన తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ కు వెళ్లిన సీఎం కుటుంబం, అక్కడ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తిరుమల మాడ వీధుల్లో ముఖ్యమంత్రి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో భక్తులు ఆయన్ను చూసి ఉత్సాహంగా పలకరించారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పక్కన పెట్టి మరీ భక్తుల వద్దకు వెళ్లిన సీఎం, వారితో కరచాలనం చేస్తూ ఫోటోలు దిగారు. ఓ భక్తురాలు తన వద్దనున్న కరుంగళి మాలను సీఎంకు బహుకరించారు. దానిని ముఖ్యమంత్రి అప్యాయంగా స్వీకరించారు. లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదం చాలా బాగుందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనం మరింత వేగంగా జరిగేలా చూడాలని భక్తులు కోరగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తిరుమల వీధుల్లో భక్తులతో సీఎం చంద్రబాబు. మరోవైపు శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల వీధుల్లో ఉన్న భక్తులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కాన్వాయ్ దిగి కొద్దిసేపు కాలినడకన తిరుగుతూ భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదం నాణ్యత ఎలా ఉందని భక్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం నాణ్యత చాలా బాగుందని ముఖ్యమంత్రికి భక్తులు తెలియజేశారు.దర్శనం వేగంగా జరిగేలా చూడాలని సీఎంను భక్తుల కోరారు.త్వరలో ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనం త్వరిత గతిన టీటీడీ జరిగేలా చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. తిరుమల మాడ వీధిలో భక్తులకు నమస్కరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ ముందుకు సాగారు. మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులతో ఫోటో సీఎం చంద్రబాబు, దేవాన్ష్‌లు ఫోటో దిగారు. సెక్యూరిటీని సైతం పక్కన పెట్టీ భక్తుల వద్దకు వెళ్ళి వారితో సీఎం చంద్రబాబు, లోకేశ్ కరచాలనం చేశారు. మరోవైపు దేవాన్ష్‌కు భక్తులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.