ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో వర్షాలు

అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపింది. మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) కూడా ఇదే విధమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. శుక్రవారం (మార్చి 20) రోజున రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. శనివారం (మార్చి 21) రోజున ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ చెప్పారు. ఆదివారం (మార్చి 22) రోజు కూడా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అకాల వర్షాలతో ప్రజలకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభించింది. అయితే రైతులు మాత్రం అకాల వర్షాలతో ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే అకాల వర్షాల నేపథ్యంలో రైతులు కోసిన పంటలను తడవకుండా భద్రపరుచుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. రైతులు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, పొలాల్లో ఉండరాదన్నారు. అకాల వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం సమీక్ష నిర్వహించారు. గాలివానలు, వర్షాలు, వడగళ్ల వానతో ఇప్పటివరకు దెబ్బతిన్న పంట నష్టం వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాలను సీఎం కు వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా, 2,043 మంది రైతులు నష్టపోయారని చెప్పారు. అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైనా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని. మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎం తెలిపారు.